Sunday 26 August 2012




సమర్ధ సదురువు శ్రి సాయినాధుల లీలా వైభవం:

శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంత వరౌ తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవదం ఒక్కటే చక్కని మార్గం.

ఈ కలియిగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావడానికి, భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాధునిలో ఇక్యం కావడానికి, నిరంతరం మానవాళిని పట్టి పీడించే అరిషడ్వర్గముల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామ జపం. నామ జపం చేస్తే ఇక ఏ యగ్ఙ్య యాగాదులు అవసరం వుండవు. అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము.

ఎన్నో వేల జన్మలలో అపారమైన పుణ్యం చేసుకొని వుంటే తప్ప సాయి భక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన శిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మలలో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు.కాని మాయలో పడిపోయిన మనము ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనె రాలిపోతున్నాం లేక గురువారం భక్తులు గా మిగిలిపోతున్నాం. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం. సాయిని కేవలం కోరికలు తీర్చే యంత్రంగానే విపయోగించుకుంటున్నాం.సాయి భక్తులమైన మనము సాయి నుండి కోరవలసింది భౌతికమైన ఇహికపరమైన కోరికలు కాదు. కోరికలు కలుగని స్థిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెల్సుకోవల్సింది కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి వుండడం.

నిరంతరం సాయినే ధ్యానించు. నిరంతరం సాయి నామస్మరణ చెయ్యు. నిరంతరం సాయి తోనే మాట్లాడు, జీవితాన్ని సాయి మయం చెసుకో